సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని కొత్తపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.