VSP: జిల్లాలో ఉదయాన్నే అగ్నిప్రమాదం జరిగింది. రుషికొండ బీచ్ రోడ్డులో వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు దూకాడు. దీంతో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.