VSP: చింతల్లోవ, కాకరలోవ, జయేంద్ర కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జీవీఎంసీ జోనల్ కమిషనర్ హేమవతి పరిశీలించారు. కార్పొరేటర్ గల్లా చిన్నతో కలిసి మౌలిక సదుపాయాల గురించి స్థానికులతో మాట్లాడారు. పనుల పురోగతిని సమీక్షించారు. సచివాలయ, శానిటేషన్ సిబ్బంది ఆమె వెంట ఉన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆమె సిబ్బందికి సూచించారు.