PLD: రాజ్యాంగంపై చర్చలో నరసరావుపేట టీడీపీ పార్లమెంటరీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శనివారం లోక్ సభలో మాట్లాడారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లుకు తమ పార్టీ మొదటి నుంచి మద్దతు తెలుపుతుందని, ఇందులోనే స్థానిక సంస్థల ఎన్నికలను చేర్చాలని కోరారు. రాజ్యాంగ స్పూర్తితో తమ పార్టీ పనిచేస్తుందని, ప్రజాస్వామ్యయుత విధానాలకు మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.