VZM: చీపురుపల్లి మండలం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇవాళ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే కళా వెంకటరావు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం ‘ఇంద్రధనస్సు’ పథకం అమల్లోకి తెచ్చిందన్నారు. అంగవైకల్యం 40% పైబడిన ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. దివ్యాంగులుతో కలిసి బస్సులో ప్రయాణించారు.