బీసీలను, మరీ ముఖ్యంగా యాదవులను అణగదొక్కాలన్న లక్ష్యంతో మాజీ జడ్పీటీసీ, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట శేషయ్యపై అక్రమంగా కేసు నమోదు చేశారని శనివారం వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. చెప్పుడు గుంటలోని జిల్లా సెంట్రల్ జైల్లో వెంకట శేషయ్యను ఆయన పలకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.