BPT: పర్చూరు నియోజకవర్గంలో రహదారుల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 5.40 కోట్లు మంజూరు చేసినట్లు సోమవారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. దీనికి సంబంధించి జీవో ఆర్టీ నం. 115 కూడా విడుదలయిందని పేర్కొన్నారు. తిక్కరాజుపాలెం-చెరుకూరు సహా పలు కీలక రోడ్ల పునరుద్ధరణ వల్ల రైతులు, విద్యార్థుల రవాణా కష్టాలు తీరుతాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.