KDP: జిల్లాలోనే అతి పెద్ద చెరువు ఒంటిమిట్ట చెరువు అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం ఒంటిమిట్ట హరిత హోటల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు పాటూరు గంగిరెడ్డి ఒంటిమిట్ట చెరువు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభపరిణామమని అన్నారు.