సత్యసాయి: పుట్టపర్తిలో బెస్త కళ్యాణ మండప నిర్మాణానికి ప్రముఖుడు బెస్త బయన్న రూ. 5,10,012 విరాళం అందజేశారు. ఈ నిధులు నిర్మాణ పనులకు కీలకంగా మారుతాయని కమిటీ సభ్యులు జ్యోతి కేశవ, జై సాయి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, కులస్తులు, దాతలు సహకరించాలని కోరారు. సామాజిక బాధ్యతతో స్పందించిన బయన్నను స్థానికులు అభినందిస్తున్నారు.