NDL: శ్రీశైలంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, పండితులు ముందుగా దత్తాత్రేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గణపతి పూజ, దత్తాత్రేయ ఆరాధన, పాలాభిషేకం, పంచామృత అభిషేకం జరిపారు. పలు ప్రాంతాల భక్తుల దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.