BPT: శనగ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్కొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ఈ నెల 28 నుంచి శనగ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. క్వింటా శనగలకు రూ. 5,875 మద్దతు ధర కల్పిస్తున్నామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు.