ATP: గుత్తిలోని లక్ష్మీ వైన్ షాప్ వద్ద అధిక మద్యం సేవించి వీరాంజనేయులు అనే వ్యక్తి శుక్రవారం అపస్మారక స్థితిలో పడిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు వీరాంజనేయులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.