NLR: గుడ్లూరు మండలంలో బుధవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటన కార్యక్రమం ఉన్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. రామాయపట్నం పోర్ట్ నిర్వాసితులైన కర్లపాలెం మత్స్యకారులకు R&R కాలనీలో నివేశన పట్టాలను మంత్రి పంపిణీ చేస్తారంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు కూటమి నేతలు పాల్గొంటారని పేర్కొంది.