గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. అనుమతులు లేకుండా మంగళగిరి నుంచి తెనాలి మీదుగా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. గత రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను డీఎస్పీ జనార్ధనరావు పట్టుకొని సీజ్ చేశారు. చక్రాయపాలెంకు చెందిన ఓ వ్యక్తి ఈ దందాలో కీలక సూత్రధారిగా గుర్తించారు. నిందితుడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం.