అన్నమయ్య: మదనపల్లిలో జలధార ప్రాజెక్టు అమలు తీరును కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల్లో సమిష్టి కృషితో నీటి సంరక్షణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపారు. భూగర్భ జలాల పెరుగుదలతో వ్యవసాయానికి లాభం చేకూరిందని చెప్పారు. జలధార ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.