KRNL: 2025-26 రబీ సీజన్కు కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ శుక్రవారం తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉండటంతో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.