CTR: విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం అలవార్చుకోవాలని ఏంఈవో హరిప్రసాద్ వర్మ పేర్కొన్నారు. శనివారం విజయపురం క్లస్టర్ రిసోర్స్ సెంటర్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు HM సుమతి, సీఆర్సీ కార్యదర్శి వెంకమరాజు బహుమతులు అందజేశారు.