KRNL: మంత్రాలయం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శుక్రవారం ఈ విషయాన్ని తెలిపారు. వివిధ కంపెనీల్లో 690 ఖాళీలు ఉన్నాయన్నారు. 10వ తరగతి నుంచి ఫార్మసీ వరకు చదివిన 18–40 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని చెప్పారు.