AKP: వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువులబంద PVTG కొందు గిరిజన గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. RWS అధికారులు గ్రామాన్ని సందర్శించి పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గిరిజనులే మంచినీటి పైపులను మోసుకుంటూ గ్రామానికి తీసుకెళ్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.