VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి, 63వ వార్డు క్రాంతి నగర్లో చోరీ చోటుచేసుకుంది. బాధితురాలు ముంతాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. సమీపాన ఉన్న మసీదుకు ఇవాళ వేకువజామున ఒంటి గంటన్నర సమయంలో నమాజ్ నిమిత్తం వెళ్లానని, తిరిగి రెండున్నర సమయంలో వచ్చేసరికి బీరువాలో పది తులాల ఆభరణాలు, రూ.25 వేల నగదు, వెండి చోరీ జరిగాయని బాధితురాలు వాపోయారు.