E.G: బీజేపీ ఆధ్వర్యంలో మహిళల 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రేపు సోమవారం ఉదయం 9:30 గంటలకు కొవ్వూరులో పాదయాత్ర నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. కొవ్వూరు బస్ స్టాండ్ సర్కిల్ నుంచి RDO కార్యాలయం వరకు జరిగే ర్యాలీని విజయవంతం చెయ్యాలని కోరారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశిధరాజు పాల్గొంటారని తెలిపారు.