సత్యసాయి: జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం జిల్లా పారిశ్రామిక అనుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. పరిశ్రమలకు రావాల్సిన అనుమతులను అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాల పురోగతిని సమీక్షించి, భూకేటాయింపు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.