సత్యసాయి: కదిరి మండలం కుమ్మరోళ్లపల్లిలో గుడి నిర్మాణంలో వున్న అసంపూర్తిగా వున్న విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపినట్లు డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కదిరి టౌన్ సీఐ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.