GNTR: అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వేతనాల పెంపు, గ్రాట్యూటీ, 5G స్మార్ట్ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మినీ అంగన్వాడీల అప్గ్రేడ్ కోసం రూ. 86.68 లక్షలు విడుదల చేశామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.