ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుంతకల్లు మండలం గొల్లల దొడ్డి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ అనే కిరాణా వ్యాపారి కుమారుడు ఆర్.మధు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.