KDP: గండి క్షేత్రంలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 26న నిర్వహించే వేలంపాటలో హిందూయేతరులకు దేవస్థానంలో గదులు కేటాయించవద్దని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ అన్నారు. గండి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సుబ్బయ్యకు మంగళవారం బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.