తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో ఇవాళ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కార్యాలయ అధికారి శ్రీనివాసులు ప్రకటించారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దాదాపు 880 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.