TPT: సూళ్లూరుపేట మండలం కోటపోలూరు రోడ్డుకు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఒక జింక రోడ్డుపైకి వచ్చింది. దీంతో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రోడ్ సేఫ్టీ సిబ్బంది జింకను సంరక్షించి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నీటి కొరత కారణంగా అడవిలోని జంతువులు బయటకు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.