KDP: ఖాజీపేట అగ్రహారంలో జరిగిన యువతి కీర్తన హత్య ఘటనపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ మార్చురీలో మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.