తిరుపతి జిల్లా, సత్యవేడు పంచాయతీ పరిధిలోని కోమటి గుంటలో నడుస్తున్న సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ద్వారా వెదజల్లుతున్న దుమ్ము ధూళి, రసాయన వ్యర్ధాల కాలుష్యంపై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. కాలుష్యం నుంచి తమను కాపాడాలని కోరుతూ గురువారం కోమటిగుంట వాసులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.