W.G: ఆకివీడు శ్రీ వనువులమ్మ దేవస్థానం అర్చకుడు లంక నరసింహారావుకు ఉగాది పురస్కారం లభించింది. భీమవరంలో గురువారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదుగురు అర్చకులకు ఈ గౌరవం దక్కగా, బీఎస్ఎన్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. పురస్కారం అందుకోవడంపై నరసింహారావు హర్షం వ్యక్తం చేశారు.