KKD: దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ సానా సతీష్ బాబు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. మహిళల భద్రత, ఆర్థిక సాధికారత, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి సారిస్తున్నామని ఆయన వెల్లడించారు.