శ్రీకాకుళం జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయడం, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఆదివారం రాత్రి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలో “నారి శక్తి” కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి మహిళలు, యువతతో ముచ్చటించారు. అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద కాల్స్కు స్పందించవద్దని వివరించారు.