ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో చీనీ ధరలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రోజులుగా టన్నుపై రూ.1000 చొప్పున ధర క్షీణిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం జరిగిన విక్రయాల్లో టన్ను గరిష్ఠ ధర రూ.21 వేలు పలకగా, కనిష్ఠం రూ.8 వేలకు పడిపోయింది. మార్కెట్ యార్డుకు 990 టన్నుల దిగుమతి వచ్చినట్లు కార్యదర్శి రాఘవేంద్రకుమార్ తెలిపారు.