KDP: పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం-2ను ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని గదులు, వంటశాల, పరిసరాలను స్వయంగా పరిశీలించిన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ప్రతిరోజు కోడిగుడ్డు, పాలు, ఇతర పోషకాహార పదార్థాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.