KKD: జగ్గంపేట టీచర్స్ కాలనీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఒడిబోయిన మణికంఠ మద్యం మత్తులో భార్య సాయితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన 11 నెలల కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అనంతరం పాపతో కలిసి పోలవరంలో కాలువలో దూకగా చిన్నారి మరణించింది. మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.