PPM: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ నాయకులు బి.వి. రమణ, గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు సోమవారం ఆందోళన చేపట్టారు. అద్దె బస్సు సిబ్బందికి ప్రమాద బీమా చేయించాలని, పార్సిల్ బుక్ చేసే వారి నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.