AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయం వేసవి శిక్షణ శిబిరాల కరపత్రాలను ఆదివారం ఎంఈవోలు తలుపులు, నాగేంద్ర ఆవిష్కరించారు. శాఖ గ్రంథాలయ అధికారిని దమయంతి మాట్లాడుతూ.. ఈనెల 28వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరాలు మొదలవుతాయని పేర్కొన్నారు. అందులో భాగంగా విద్యార్థులను గ్రంథాలయానికి పంపించాలని కోరారు. చిన్నారులకు విభిన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.