కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామానికి చెందిన హుస్సేన్ బాషా (22) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని రైల్వే ట్రాక్పై శుక్రవారం ఓ యువకుడి మృత దేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.