KDP: వైవీయూ డిగ్రీ 3, 4, 5వ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ బుధవారం విడుదల చేశారు. నవంబర్ 2025లో జరిగిన ఈ పరీక్షల్లో 3వ సెమిస్టర్లో 62.39%, 4వ సెమిస్టర్లో 81.58%, 5వ సెమిస్టర్లో 77.14% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పద్మ, కృష్ణారావు పాల్గొన్నారు.