NDL: ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాయలసీమ గురించి ఏమాత్రం పట్టించుకోలేదని జగన్ రాయలసీమ ద్రోహి అని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆదివారం నందికొట్కూరు మండలంలోని మల్యాల ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే ప్రాజెక్టుకు ఎక్కువ నిధులు మంజూరు చేశామని తెలియజేశారు.