NRML: కడెం మండలంలోని ఉడుంపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాత ఉట్నూరుకు చెందిన గొడిపెల్లి నడిపి మల్లయ్య, మల్లేష్, మల్కరి దుర్గయ్య ఖానాపూర్ కు పని నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఉడుంపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా నడిపి మల్లయ్య మృతి చెందాడు.