ADB: తెలంగాణ రాష్ట్ర అర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడారు. రోజూ అప్పు చేస్తే కానీ గడవని ఆర్థిక పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు.