BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.