సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను మంగళవారం పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు కలిశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ సమస్యలను విన్నవించి వినతిపత్రాలు అందజేశారు. వారి విన్నపాలను సావధానంగా విన్న మంత్రి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గట్టి భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు.