SDPT: కుమ్మేర మల్లన్న జాతరలో రజకులపై జరిగిన దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలో సోమవారం రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన 8 మందిని తక్షణమే అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రహదారిపై బైఠాయించారు.