బీహార్ నలంద జిల్లాలోని శీతలా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి మంగళవారం మాదిరిగానే అమ్మవారిని పూజించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. మరో 12 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు.. సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.