HYD: హైడ్రా కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 58 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కాలనీ రహదారుల కబ్జాలు తదితర సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.