VKB: కడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి నేతృత్వంలో కొడంగల్ రైతులు అశ్వారావుపేటలోని ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. టీజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవ రెడ్డి రైతులకు సాగు విధానం, దిగుబడి, ఆర్థిక ప్రయోజనాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాలను వివరించారు. వ్యవసాయ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.