E.G: సీతానగరం మండలంలోని బొబ్బిల్లంక, ములకల్లంక, కాటవరం తదితర గ్రామాల్లో గోదావరి నదీ తీరం కోతకు గురవుతోంది. వందలాది ఎకరాల పంట భూములు నదిలో కలిసిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. వరదల సమయంలో నష్టం మరింత పెరుగుతుందని, తక్షణమే రివిట్మెంట్ పనులు చేపట్టి తమ భూములను కాపాడాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.